డా. చిత్తర్వు మధు విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ హైస్కూల్లో, హయ్యర్ సెకండరీ వరకు. ఆ తర్వాత కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజిలో ఎం.బి.బి.ఎస్; విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎండి; ఆ తరువాత అల్జీరియాలో మెడికల్ స్పెషలిస్ట్ అండ్ కార్డియాలజిస్ట్గా పని చేసి ప్రస్తుతం 1986 నుంచి హైదరాబాద్లో కన్సల్టింగ్ ఫిజీషియన్ అండ్ కార్డియాలజిస్ట్గా పైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
“ఐ.సి.సి. యూ“, బైబై పోలోనియా, ఔనా, సాలెగూడు అనే నవలలు రచించారు. ఇవి కన్నడంలోకి కూడా అనువాదమై ప్రచురించబడ్డాయి.
కథలు కళాఖండాలు లాగాను, నవలలు వేగంగా ఉత్కంఠభరితంగాను రాయాలని వీరి అభిలాష.
మానవతా దృక్పథం, శాస్త్రీయ దృక్పథం, సున్నిత మనస్తత్వ చిత్రణ, మారిపోతున్న సమాజంలో మారుతున్న విలువలు, పరస్పర సంబంధాలు – ఇలాంటివన్నీ చిత్రిస్తూ కథలు నవలలు రాయాలని వీరి ఆశ, ఆశయం.
సాహిత్యం, సంగీతం, పుస్తక పఠనం వీరి హాబీలు.
తెలుగులో మొట్టమొదటిసారి వైద్య విజ్ఞాన నేపథ్యంతో థ్రిల్లర్ నవలలు రాసిన రచయితగా వీరికి గుర్తింపు లభించింది.
ఐ.సి.సి.యు. On Kinige
మధుమేహంపై విజయపథం On Kinige
కుజుడి కోసం On Kinige
బై, బై, పోలోనియా On Kinige
ఔనా…! On Kinige
ది ఎపిడమిక్ On Kinige
సాలెగూడు
www.utopia.com On Kinige