తెలుగు సాహిత్యంలో దాదాపు మూడున్నర దశాబ్దాలుగా నిరంతరంగా వ్రాస్తూ , తన అభిమానుల్ని అలరిస్తున్న రచయిత ‘మధుబాబు’ . అనితర సాధ్యమైన ‘షాడో’ సృష్టికర్త మృదు మధురమైన జానపద నవలాకారుడు. ఆయన శైలి అత్యద్భుతం నాలుగు వాక్యాలు వ్రాస్తే చాలు అవి ఆయన వ్రాసినవే నని అందరు గుర్తుపట్టే విధంగా వుంటుంది ఆయన ఉపయోగించే భాష .
సున్నితమైన భావాలను సైతం సూటిగా చిన్న చిన్న వాక్యాలలో చెప్పి మెప్పించగల మాటల మాంత్రికుడు. కాకా హోటల్స్ లో పనిచేసే వెయిటర్స్ దగ్గిర్నించి కార్పోరేట్ ఆసుపత్రులలోని డాక్టర్స్ వరకు అన్ని రంగాలలోను ఆయన అభిమానులు వున్నారు. ఆ మధుబాబు యువ నవ కధకులను ఆహ్వానిస్తున్న *కినిగే స్మార్ట్ స్టోరి కాంపిటిషన్ (2013)* గురించి ఏమని అంటున్నారో చదవండి!
“మనకి కొత్త రచయితలు కావాలి. ఒక చక్కని రచయితగా ఒక పది కాలాల పాటు రాయగలగాలి. అలాంటి రచయితల్ని అహ్వానిస్తూ, ప్రోత్సహిస్తున్న కినిగె వారి స్మార్ట్ స్టోరి కాంఫటిషన్ సరైన సమయంలో సరైన పోటిని నిర్వహిస్తున్నందుకు అభినందిస్తున్నాను. నవయువ రచయితలు ఈ అహ్వానాన్ని అందుకోవాలి. వారి రచనల కోసం నేను కూడా ఎదురుచూస్తుంటాను” .
కినిగే స్మార్ట్ స్టోరి కాంపిటిషన్ (2013) వివరాలకు ఇక్కడ చూడండి:
http://teblog.kinige.com/?p=2773
మధుబాబు నవలలు ఇక్కడ కొని చదువుకోండి:
http://kinige.com/kbrowse.php?via=tags&tag=Madhubabu