
ఆదూరి వెంకట సీతారామమూర్తి
హరివంశీ పచ్రురణలు
సీతమ్మధార, విశాఖపట్నం.
UTSAVA KAANUKA
(Anthology of Short Stories)
by
©Aduri Venkata Seetarama Murty
First Published : April 2007.
Title Designed by
Sri BAPU
Author’s Photo : Hema Shankar
For Copies :
Smt. A. Satyavathi Devi
50–52–2, Seetammadhara
Visakhapatnam – 530 013.
Ph : 0891 – 2536741
Visalandhra Book House, Hyderabad
and its branches in A.P.
Printed at :
Satyam Offset Imprints
Visakhapatnam – 16.
Price : Rs.50/–
ఉత్సవ కానుక… 5
అమ్మాయిపెళ్ళి…… 22
తెరువు….. 37
పాత బంగారులోకం……. 57
ఊరట….. 67
చిలకాకుపచ్చ రంగు జరీచీర…. 81
బతుకుదారి…. 91
సర్వం జగన్నాథం…….. 103
వృత్తి ధర్మం……… 119
అంతరాలు……. 127
సంసారంలో హింసానాదం…….. 141
బంధం…….. 171
బెస్ట్ కపులూ – గిఫ్ట్ కూపనూ……… 178
గోరింట పండింది…. 188
ఆనందపురం వెళ్లాలి…. 202
‘ఆత్మధృతి’ కథాసంపుటిపై…. 210
కొన్ని సమీక్షలూ..లేఖలూ.. అభిప్రాయాలూ… 210
Seetarama Murty – A Gentle Persuader. 220
ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక. అక్టోబరు 24, 2003
ఆనాటి ఉత్సవ ప్రారంభ వేడుక ఎంత ఘనంగా జరగాలో అంత ఘనంగానూ మొదలైంది. తన జీవితమంతా శాస్త్రీయ సంగీత సాధనలోనూ, బోధనలోనూ గడుపుతూన్న సంగీత కులపతి మార్కండేయశాస్త్రి గారి ఆధ్వర్యంలో యీ ఆరాధనోత్సవాలు తక్కువస్ధాయిలో జరుగుతాయని ఎవరూ వూహించరు. సరస్వతీ గాన సభ హాలు అత్యంత సుందరంగా అలంకరింపబడింది. వేదిక అంతా పరిమళాలు విరజిమ్మే రంగురంగుల పూలగుత్తులతో నిండి వుంది – వేదికకు ఒక ప్రక్క త్యాగరాజస్వామి వారి తైలవర్ణచిత్రం గులాబీలూ మల్లెల దండలతో అలంకరింపబడి వుంది.
ఉదయం పూజానంతరం తిరువీధి– ఊరేగింపు కార్యక్రమం. తరువాత పంచరత్న సేవ. వేదికమీద అటు పాతిక మంది, యిటు పాతిక మంది నిష్ణాతులూ, ఔత్సాహికులూ అయిన గాయనీ గాయకులూ, వేదిక మధ్యలో మైకు ముందు శాస్త్రిగారు. ఆయన తమ గళాన్ని సరిచేసుకున్నారు – హాలంతా సంగీతప్రియులతో నిండి వుంది.
“జగదానంద కారక… జయ జానకీ ప్రాణ నాయక…”
త్యాగరాజ స్వామి వారి కీర్తనల్లో ఆణిముత్యాలనదగ్గ పంచరత్న కీర్తనల్లో మొదటి కీర్తనను ఆలపించారు శాస్త్రిగారు – వేదిక మీద కళాకారుల కంఠాలన్నీ ఏక కంఠంగా సేవ మొదలయ్యింది. నాట రాగంలో సాగిన ఆ కీర్తనకు హాల్లో ప్రేక్షక సీట్లలో కూర్చున్న ఔత్సాహిక కళాకారులు తాళం వేయడం ప్రారంభించారు – చూడ్డానికీ వినడానికీ కూడా మనోహరంగా వుందా దృశ్యం.
“… ఎల్ల లోకాలకూ ఆనందదాయకమైన వాడా… జానకీరమణా సుగుణాకరా. .. పాపరహితుడా… అందమైన ముఖము, అమృతమయమైన వాక్కు గలవాడా… ఇంద్రనీల మణుల కాంతివంటి కాంతిగల శరీరము గలవాడా… చంద్ర సూర్యనేత్రుడా… సృష్టి స్థితి లయాలకు కారకుడా… శరణాగతుల్ని పాలించేవాడా… సత్కవుల హృదయాలలో వేంచేసి వుండేవాడా… దేవముని స్నేహితుడా.. త్యాగరాజాది వరభక్తులు నిన్ను నుతిస్తున్నారు…”అనే భావన శ్రావ్యమైన నాటరాగంలో ఒదిగి కళాకారుల కంఠాలగుండా జాలువారి హాలు హాలంతా పరుచుకుంది.
అటు సంగీత వాహినిలో ఓలలాడుతూనే ఒక కార్యకర్తగా మొదటి ద్వారానికెదురుగా నిలబడి పర్యవేక్షిస్తూ వున్నాను నేను – ప్రముఖులు కూర్చున్న ముందు వరుసలో ఒక్క సీటు మాత్రం ఖాళీగా వుంది – రెండు మూడు వరుసల్లో కొన్ని సీట్లు ఎవరికోసమో నిర్దేశింపబడినట్లు ఖాళీగా వున్నాయి.
ఇంతలో ముందు ద్వారం గుండా ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించేడు. ఆరడుగల ఆజానుబాహువు, నెరిసిన తల – తెల్లని పట్టు లాల్చీ, పైజామా వేసుకున్నాడు. అతని వెనుక అతని భార్య కాబోలు ఆకుపచ్చరంగు పట్టుచీరలో వుంది. ఆమెతో పాటు ఓ పదేళ్ల కుర్రాడు. వాళ్లు ముగ్గురూ సరాసరి ముందువరుసలోని ముఖ్యుల్ని దాటుకొంటూ వచ్చి హాలంతటినీ ఓ మారు పరికించి రెండో వరుసలో ఖాళీగా వున్న సీట్లలో కూర్చున్నారు. ఆయనెవరో నాకు ఎప్పుడూ ఎక్కడా చూసినట్టు గుర్తులేదు. ఆహ్వానితులలో ముఖ్యుడో, లేదా అటువంటి ముఖ్యుల బంధువో తెలియలేదు–
“… దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా…”
గౌళ రాగంలో త్యాగరాజస్వామి రెండవ పంచరత్న కీర్తన మొదలయింది. తెలిసిన స్ధానిక కళాకారులు కొందరొస్తే వారికి సీట్లు చూపించి కూర్చోబెడుతున్నాను. ఇంతలో పట్టులాల్చీ ఆసామి లేచి స్టేజీకి దగ్గరగా వెళ్లి చేతిలోని ఫ్లాష్ కెమెరాతో నాలుగైదు ఫోటోలు తీసి వచ్చి భార్య పక్కన కూర్చున్నాడు.
ఉదయం సభ కావటాన, అందులోనూ సెలవుదినం కాకపోవటాన రద్దీ ఆట్టే లేకపోయినా హాలు సుమారుగా నిండుగానే వుంది.
కర్ణాటక సంగీత రత్నత్రయంలో అగ్రగణ్యులైన త్యాగరాజస్వామి వారికి ప్రతియేటా తిరువైయూరులో ఆరాధనోత్సవాలు విశేషరీతిలో జరుగుతూండడం, సంగీతమే తన జీవిత ధ్యేయమూ, గమనమూ, అనుకుని ఉచితంగా సంగీతాన్ని నేర్పి ఎన్నో వందల మంది సంగీత కళాకారుల్ని తయారుచేసిన మార్కండేయ శాస్త్రిగారు ఆ ఉత్సవాలకు శిష్యులతో సహా వెళ్లి రావడం కొన్ని ఏళ్లుగా జరుగుతూనే వుంది. అయితే యింతమంది సంగీత కళాకారులూ, అభిమానులూ వున్న యీ పట్నంలో కూడా అటువంటి ఉత్సవాలు శక్తికొద్దీ జరిపి త్యాగరాజస్వామి వారినెందుకు ఆరాధించకూడదూ అనే పట్టుదలతో ఉద్యమించి అభిరుచిగల వారిని సంప్రదించి రెండేళ్ల క్రిందటే మొదటి ఉత్సవం జరిపారు. ఆయన కృషికి తగిన ప్రోత్సాహమే లభించింది. ఉత్సవ కమిటీలో నగరానికి చెందిన కొందరు ప్రముఖులు వుండటం వల్ల ఆర్ధికపరమైన యిబ్బందులు ఆట్టే లేవు. ఇప్పుడు సంగీతాభిమానులకీ లోటులేదు–
“..ఎందరో మహానుభావులు…మేఘశ్యాముని అందాలు హృదయారవిందములో చూసుకొని బ్రహ్మానందాన్ని పొందేవారెందరో!… సామగానం చేసే ధన్యులెందరో… మనస్సనే కోతి సంచారాన్ని నిలుపుచేసి దివ్యమూర్తిని పొడగాంచే వాళ్లెందరో… పారమార్థిక మార్గంలో పరాత్పరుణ్ణి స్వరం, లయ, రాగం తెలిసి పాడే వాళ్లెందరో… భాగవతరామాయణాలు, వేదం, శాస్త్రపురాణాలు, ఆరు మతాల రహస్యాలూ, ముప్ఫయ్ మూడు కోట్ల దేవతల అంతరంగ భావాలూ తెలిసి, భావ రాగ తాళాల సౌఖ్యం గమనించి చిరాయువూ నిరవధి సుఖమూ అనుభవిస్తూ త్యాగరాజ బంధువులైన వాళ్లెందరో … రాముడికి యదార్థ దాసులైన వాళ్లెందరో… ఆ మహానుభావులందరికీ వందనాలు–” అనే భావనతో స్వరాన్వితమైన ‘ఎందరో మహానుభావులందరికీ వందనములు”అనే ఐదవ ఘనరాగ పంచరత్న కీర్తన సంగీతాభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.
అలా ఉదయం పది గంటలకు త్యాగరాజ పంచరత్న సేవ ముగిసింది. కొంత విరామానంతరం సంగీత సభలు మొదలవుతాయి – ఔత్సాహిక, బాల కళాకారులకు పదేసి నిముషాలూ, లబ్ధ ప్రతిష్టులకు పదిహేను, ముప్ఫయ్ నిముషాలూ కేటాయిస్తూ అలా మూడురోజులూ రాత్రి తొమ్మిది గంటల వరకూ జరుగుతాయి.
విరామ కాలంలో ప్రసాద వితరణ కార్యక్రమం మొదలైంది – పట్నంలో ప్రఖ్యాతి గాంచిన ఓ పెద్ద హోటల్ వారు ప్రసాదాలు పంపడానికి ముందుకొచ్చారు. పులిహార, చక్కెర పొంగలి రెండు వేర్వేరు ఆకు దొన్నెల్లో వేసి అందిస్తున్నారు కార్యకర్తలు – వచ్చేవారిని ఒక వరుస క్రమంలో నిలిపే ప్రయత్నంలో నేనున్నాను.
సరిగ్గా అప్పుడు మళ్లీ చూశానా పట్టు లాల్చీ ఆసామీని. ఈమారు కాస్త పరీక్షగానే చూశాను. స్థానిక రాజకీయ నాయకుడితో కల్పించుకుని మాట్లాడుతున్నాడు. పెద్దగా విరగబడి నవ్వుతున్నాడు. తననందరూ పరికిస్తున్నారో లేదోనని చుట్టూ చూస్తున్నాడు – కాస్సేపాగి ప్రసాదాలిచ్చే స్థలం వద్దకు వచ్చి “అబ్బో చాలా క్యూ వుందే. ఇచ్చేయ్యలేరా” అంటూ చెయ్యి చాపేడు – ఒకరిద్దరికి యిచ్చాక అక్కడి కార్యకర్త యితగాడికీ ప్రసాదం యిచ్చేడు–
‘క్యూలో రావొచ్చు గదా!’ అంటున్నారెవరో – అతగాడు పట్టించుకుంటేనా?
ప్రసాదాలకోసం క్యూ ముందుకు జరుగుతోంది. ప్రసాదం తెచ్చిన రెండు అండాలూ ఖాళీ అవుతున్నాయి – వెంటవెంటనే నిండుతున్నాయి కూడా. జరగబోయే సంగీత సభల గురించీ, ఏర్పాట్ల గురించీ అంతా మెచ్చుకుంటున్నారు. శాస్త్రిగారి కృషిని అందరూ పొగుడుతున్నారు –
“ఊరికొక్కరు చాలు శాస్త్రిగారి వంటివారు– మన సంస్కృతీ సాంప్రదాయాలు రక్షింపబడ్డానికీ, సంగీత సాహిత్య కళారూపాలు వెలుగులోకి వచ్చి అందరికీ అందుబాటులోకి రావడానికీ.”
క్యూలో వెనుకనున్న ఎవరో అనడం నా చెవినా బడింది.
మరి కొద్దిసేపట్లో ప్రసాద వితరణ కార్యక్రమం పూర్తయిపోతుందనగా ఆకుడొప్పలు అయిపోయాయి. ఉన్నవారు కొద్దిమందే. అయినా శర్మను పిలిచి వాటిని తెచ్చే పనిని వురమాయించేను. అంతలోకే అక్కడ మిగిలిన కొద్దిమందిలో ఒక ఆసామీ ముందుకొచ్చి.
“అయ్యాదొప్పల అవసరం లేదు – దైవ ప్రసాదం కాసింతైనా చాలు. చేతుల్లో వేసేయ్యండి” అన్నాడు –
పొందూరు ఖద్దరు లాల్చీ, పంచ, పై మీద కండువాతో వున్నాడతను – దాదాపు యాభై ఏళ్లుండొచ్చు నాతనికి.
‘ఔనండీ. దొప్పలు అవసరం లేదు.’అన్నారు మరొకరు.
నిజానికి ఆ కొద్దిమంది కోసం ఆకుదొప్పల్ని తెప్పించనక్కరలేదు. కానీ అందరికీ అన్నీ సమానంగా అందాలి. ఎవరూ నిరాశపడకూడదన్నది శాస్త్రిగారి అభిమతం. అందుకే–
“ఫర్వాలేదు. వచ్చేస్తున్నాయి. ప్రసాదం కావల్సినంత తీసుకోండి”అన్నాను.
కాస్సేపట్లోనే ప్రసాద వితరణ ముగిసింది. హాల్లో కచ్చేరీ ప్రారంభమైంది. అందరూ లోపలికి దారి తీస్తున్నారు – నా వంతు ప్రసాదాన్ని నేనూ తీసుకుని లోపలకు వెళ్లే ప్రయత్నంలో వున్నాను.
ఇంతలో “అయ్యా. ఒక్కమాట!”అని ఎవరో పిల్చినట్టయి వెనుదిరిగి చూశాను. ఆయనే! క్యూలో చివరన ఉండిపోయినాయన. ఖద్దరు లాల్చీ వేసుకున్న యాభైయేళ్ల వ్యక్తి! చేతిలో చిన్న సంచీతో త్వరత్వరగా నావైపు వస్తున్నాడు.
ఆగి, ‘ఏమిటీ’అన్నట్లు చూశాను అతని వంక.
“అయ్యా, తమరు కార్యకర్తల్లా వున్నారు – నాకో చిన్న సహాయం కావల్సి వుంది. శాస్త్రిగార్ని కలవాలో, మీరే అందుకు తగిన వారో నాకు తెలియదు –“అన్నాడు.
“చెప్పండి.”అన్నాను.
“మాది సీతారాంపురం. ఈ వూరికి కొత్తవాడిని. కేవలం తమరు జరిపే యీ ఆరాధనోత్సవాల కోసమే వచ్చాను. ఇక్కడ నాకు బంధువులు గాని మిత్రులు గాని ఎవరూ లేరు – భోజనమంటే బయట ఎక్కడన్నా చేయగలను. ఈ రెండు రాత్రులూ ఉండటానికి కాస్త వసతి సదుపాయం వుంటుందేమోనని…”
అతని వివరణలో అభ్యర్ధన వుంది. ఆశ వుంది. అయితే పై వూళ్లనించి వచ్చే సంగీత కళాకారులకైతే భోజన వసతి సదుపాయాలను ఉత్సవ కమిటీ కలుగజేస్తోంది. మరి …. ఇటువంటి వారి విషయంలో…
నా ఆలోచన గ్రహించిన వాడిలా “పోనీ నా అభ్యర్ధనను శాస్త్రిగారికో, కమిటీ వారికో తెలియజేసినా సరే – లేదా … నేనే స్వయంగా వారిని…” అంటూ ఆగేడు. నేనిక ఆలోచించలేదు–
End of preview – Rest of the book is available @ http://kinige.com/kbook.php?id=215
Related Posts: