శ్రీ సూర్యదేవర రామమోహనరావు గారిని తెలుగులో 100 నవలలు పైగా రాసిన రచయితగా ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఇటీవల గుర్తించి ప్రమాణపత్రం జారీచేసింది.
1985లో “మోడల్” అనే మొదటి నవలతో ప్రారంభించిన ఆయన రచనా వ్యాసంగం 2013లో “నా ప్రేయసిని పట్టుకుంటే కోటి” అనే 101 వ నవల వరకూ కొనసాగిందనీ, ఈమధ్యే “ది ఎనిమీ ఆఫ్ మాన్కైండ్” అనే ఆంగ్లనవలను అమెరికాలో ముద్రించి, ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో ప్రచురించారని అందులో పేర్కొన్నారు. సూర్యదేవర రచించిన 101 తెలుగు నవలలో 65 కన్నడంలోకి, 5 తమిళంలోకి అనువదించబడ్డాయి.
ఈ ఘనత సాధించినందుకు శ్రీ సూర్యదేవర రామమోహనరావు గారికి అభినందనలు తెలియజేస్తోంది కినిగె.
ప్రముఖ రచయిత శ్రీ సూర్యదేవర రామమోహనరావు గారికి అభినందనలు
1