అలరించే అరాచక కవిత్వం అనే శీర్షికతో ఇండియా టుడే పత్రికలో (27 సెప్టెంబరు 2011 సంచిక) వచ్చిన ఈ వ్యాసం అరుణ్ సాగర్ రాసిన ‘మియర్ మేల్’ అనే కవితాసంపుటిపై సమీక్ష. రామా చంద్రమౌళి గారు ఈ పుస్తకాన్ని సమీక్షించారు.
కవిత్వమంటే కవి పాఠకునికి రాసిన రహస్య లేఖని వినూత్న నిర్వచనం ఉందని సమీక్షకులు పేర్కొన్నారు. అరుణ్ సాగర్ దృష్టి కొత్తదని, జీవితాన్ని అవలోకిస్తున్న కోణం కొత్తదని, అందువల్ల జీవితం అతనికి క్రొంగొత్త మిత్రులతో, వినూత్న కొలతలతో విచిత్రమైన నూతన రూపురేఖలతో దర్శనమిస్తుందని అంటారు.
కవి వాడిన కొత్త పదబంధాలు, పదచిత్రాలు కవితావాక్యాలని రసవంతం చేసాయని చంద్రమౌళి గారు అంటారు.
పూర్తి సమీక్షని ఈ దిగువ బొమ్మలో
చదవచ్చు.
ఆండ్రోమెడా ప్రచురణలు వారు ప్రచురించిన ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.50/- రూ. 30/- నెలసరి అద్దెతో దీన్ని మీ కంప్యూటర్లో చదువుకోవచ్చు.
మియర్ మేల్- పోయెమ్స్ ఫర్ మెన్ ఇన్ తెలుగు On Kinige
కొల్లూరి సోమ శంకర్