డైనమిక్ రైటర్ మధుబాబు లేటెస్ట్ తెలుగు నవల వీరభద్రారెడ్డి ఇప్పుడు కినిగెలో లభిస్తుంది. ఈ లింకు నొక్కి మరిన్ని వివరాలు చూడండి.
నేటి తెలుగు దేశాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా క్రీ.శ.1200వ సంవత్సరం నుంచీ 1325 వరకూ పరిపాలించిన వంశం – కాకతీయ వంశం.
కాకతీయ సామ్రాట్టయిన శ్రీశ్రీశ్రీ గణపతి దేవుడికి పురుష సంతానం లేకపోవడం వల్ల, తన కుమార్తె అయిన రుద్రమదేవిని తన తరువాత కాకతీయ సామ్రాజ్యానికి వారసురాలిగా ప్రకటించాడు.
ఒక ఆడది రాజ్యాన్ని పరిపాలించడం అవమానమని భావించి, తిరుగుబాటు బావుటాని ఎగురవేసారు ఎంతోమంది. కళింగం నుంచి, దేవగిరినుంచి, కొంకణం నుంచి, పాండ్యనాడు నుంచి శత్రువులు ఒకరొకరు గానూ, ఒక్కుమ్మడిగాను సామ్రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు.
రాజ్యంలో శాంతిభద్రతలు క్షీణించాయి. గ్రామసీమలు శత్రువుల దురంతాలకు, దురాగతాలకు గురికాజొచ్చాయి. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు విచ్చలవిడి అయిపోయాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని విపత్కర పరిస్థితి. ఎటుచూసినా అశాంతి, అల్లరి… ముఖ్యంగా నమ్మకద్రోహం.
ఈ సమయంలో భువనగిరి ప్రాంతాన్ని పరిపాలించే గోనగన్నారెడ్డి, శ్రీకాకుళ ప్రదేశానికి ప్రభువులైన ఐదులూరి అన్నయమంత్రి, కొలను రుద్రదేవుడు –
కాయస్త సేనానాయకుడైన జన్నిగదేవ, అంబదేవ త్రిపురాంతకాలు, ఆ తరువాత ప్రధాన దండనాయకుడైనటువంటి ప్రసాదిత్య నాయకుడు మొదలైన వారందరూ తమ తమ శక్తిమేరకు దేశాన్ని సుభిక్షం చేయడంలో రుద్రమదేవికి తోడ్పడ్డారు. ఇదిగో… ఈ గొడవల మధ్య ప్రారంభం అవుతుంది నా ఈ వీరభద్రారెడ్డి.